Saturday, October 12, 2019

కుటుంబ సభ్యుల దారుణ హత్య


కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. దొమకొండ మండల కేంద్రంలోని మల్లయ్య దేవాలయం దగ్గర ఈ దారుణం జరిగింది. మృతులు చందన(5), లత(15), బాలయ్య బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని గొంతుకోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆస్థి తగాదాల విషయంలో మృతుడు బాలయ్య తమ్ముడు రావి ఈ గాతుకానికి పాల్పడ్డాడని ప్రజలు అనుమానిస్తున్నా పోలీసులు మాత్రం హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని తెలిపారు.