Tuesday, October 19, 2021
రేపట్నుంచే షర్మిల ‘ప్రజా ప్రస్థానం’ యాత్ర
తెలంగాణలో వైఎస్ షర్మిల పాదయాత్ర రేపట్నుంచి ప్రారంభం కానుంది. తండ్రి వైఎస్సార్ సెంటిమెంట్తో ఆమె చేవెళ్ల నుంచి యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.
వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల సుదీర్ఘ పాదయాత్ర బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి షురూ కానుంది. ప్రజాప్రస్థానం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రకు శంకర్పల్లి క్రాస్ రోడ్డు వద్ద తొలి అడుగు పడనుంది. ఉదయం 11 గంటలకు అక్కడ నిర్వహించే బహిరంగ సభ, సర్వమత ప్రార్థనల అనంతరం షర్మిల యాత్ర మొదలు కానుంది. వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి జెండా ఊపి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇక పాదయాత్ర ఏయే మార్గాల మీదుగా సాగాలి? షర్మిల ఏయే అంశాలను ప్రస్తావించాలి? ప్రజలతో ఎలా మెలగాలి? అన్న దానిపై ప్రశాంత్ కిశోర్ (పీకే) బృందం పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తోంది. సుదీర్ఘ పాదయాత్రను దిగ్విజయం చేయడంతో పాటు.. సోషల్ మీడియాలోనూ విస్తృత ప్రచారం కల్పించేందుకూ ఏర్పాట్లు చేస్తోంది.
400 రోజుల పాటు 90 అసెంబ్లీ, 14 లోక్సభ నియోజకవర్గాల్లో సాగే షర్మిల పాదయాత్ర కోసం ఇప్పటికే రూట్ మ్యాప్ కూడా ఖరారు చేశారు. ఉదయం 8.30 గంటలకు ప్రారంభం కానున్న పాదయాత్ర మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన సమయంలో స్థానిక ప్రజలతో ‘మాట-ముచ్చట’ పేరుతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం 3 గంటలకు పాదయాత్ర మొదలై 6 గంటల వరకు సాగుతుంది. పార్టీ ముఖ్య నేతలు కొండా రాఘవరెడ్డి, పిట్టా రాంరెడ్డి, ఏపూరి సోమన్న తదితరులు కూడా షర్మిలతో పాటుగా నడవనున్నారు. కాగా, పాదయాత్రలో భాగంగా ప్రతి మంగళవారం తాను ఎక్కడుంటే.. అక్కడే శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ నిరాహార దీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే తన తల్లి విజయమ్మతో కలసి మంగళవారం షర్మిల ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు.
‘తెలంగాణలో రాజన్న సంక్షేమం, అభివృద్ధి కోసం 20న చేవెళ్లలో షర్మిల ప్రజా ప్రస్థానం ప్రారంభించబోతోంది. ఆమె అడుగులో అడుగేయండి. చేతిలో చేయి కలపండి. మీరు.. ఆమెతో కలిసి ప్రభంజనం సృష్టించి రాజన్న రాజ్యం సాధించుకోండి..’ అంటూ విజయలక్ష్మి ఓ వీడియో సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు.
-
'జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బిహారీ వలసదారులు, కాశ్మీరీ పండిట్లు, సిక్కులను లక్ష్యంగా చేసుకుంటున్నారు 'అని రౌత్ ...
-
పేదోళ్ల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరులో లంచం డిమాండ్ చేసే అధికారుల దవడ పగలకొట్టాలని సీఎం కేసీఆర్ అన్నారు. అలా చేస్తేనే కొంతమంది...
-
ఆదివారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో తెలంగాణ శాసనసభ, పార్లమెంటరీ పక్షాల సంయుక్త భేటీ జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్ష ఎన్ని...